ఎన్ హెచ్ -65 పై కొనసాగుతున్న రోడ్డు పనులు: ట్రాఫిక్ మళ్లింపు, ముందస్తు జాగ్రత్తలు
ఎన్ హెచ్ -65 పై కొనసాగుతున్న రోడ్డు పనులు: ట్రాఫిక్ మళ్లింపు, ముందస్తు జాగ్రత్తలు
K.RAVI
చౌటుప్పల్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్ హెచ్ -65) పై ప్రస్తుతం జరుగుతున్న రహదారి అభివృద్ధి పనుల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ అక్షాన్స్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు చౌటుప్పల్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.డిఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ తమ సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరగకుండా అదనపు పోలీస్ బలగాలను మోహరించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. పనుల సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి పలు కీలక సూచనలు చేస్తూ, ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు."జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు పోలీసులకు సహకరించాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, కేటాయించిన మార్గాల్లోనే ప్రయాణించి ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవాలి."ప్రస్తుతానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సజావుగా సాగుతోందని, వాహనదారులు సంయమనం పాటించాలని అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి