Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:38 PM

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు
April 17, 2026 03:45 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ నరసింహులు తన పొలానికి వెళ్లిన సమయంలో మొక్కజొన్న తోటలో దాక్కున్న ఎలుగుబంటి అకస్మాత్తుగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసింహులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

దాడి అనంతరం అరుపులు వినిపించడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమికొట్టి గాయపడిన నరసింహులను రక్షించారు. అనంతరం అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అడవి ప్రాంతాలకు సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టినట్లు తెలిసింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News