Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 05:15 PM

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు
April 17, 2026 03:45 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ నరసింహులు తన పొలానికి వెళ్లిన సమయంలో మొక్కజొన్న తోటలో దాక్కున్న ఎలుగుబంటి అకస్మాత్తుగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసింహులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

దాడి అనంతరం అరుపులు వినిపించడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమికొట్టి గాయపడిన నరసింహులను రక్షించారు. అనంతరం అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అడవి ప్రాంతాలకు సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టినట్లు తెలిసింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News