శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ నరసింహులు తన పొలానికి వెళ్లిన సమయంలో మొక్కజొన్న తోటలో దాక్కున్న ఎలుగుబంటి అకస్మాత్తుగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసింహులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
దాడి అనంతరం అరుపులు వినిపించడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమికొట్టి గాయపడిన నరసింహులను రక్షించారు. అనంతరం అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అడవి ప్రాంతాలకు సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టినట్లు తెలిసింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి