PRINT TIME: May 27, 2026 05:11 AM
ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
March 13, 2026 08:20 PM
64 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య సూచించారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు శాతం వందకు వంద ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇష్టపడి, ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు.
ఈ సందర్భంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి