విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు
విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు
Editor Desk
విద్యుత్ కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు సూచించినట్లు తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) వెల్లడించింది.
ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మరియు ప్రభుత్వ విప్, ఎంఎల్సీ అద్దంకి దయాకర్ లను జేఏసీ రాష్ట్ర నాయకత్వం వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
అనంతరం TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కన్సీలేషన్ సమావేశానికి జేఏసీ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. త్వరలో కార్మికుల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్మిక సోదర సోదరీమణులకు జేఏసీ నాయకులు భరోసా కల్పించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి