Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:11 PM

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు
21-04-2026 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యుత్ కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సూచించినట్లు తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) వెల్లడించింది.

ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మరియు ప్రభుత్వ విప్, ఎంఎల్సీ అద్దంకి దయాకర్ లను జేఏసీ రాష్ట్ర నాయకత్వం వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

అనంతరం TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కన్సీలేషన్ సమావేశానికి జేఏసీ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. త్వరలో కార్మికుల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్మిక సోదర సోదరీమణులకు జేఏసీ నాయకులు భరోసా కల్పించారు

Sthanikam

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు

Article Image

విద్యుత్ కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సూచించినట్లు తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) వెల్లడించింది.

ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మరియు ప్రభుత్వ విప్, ఎంఎల్సీ అద్దంకి దయాకర్ లను జేఏసీ రాష్ట్ర నాయకత్వం వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

అనంతరం TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కన్సీలేషన్ సమావేశానికి జేఏసీ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. త్వరలో కార్మికుల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్మిక సోదర సోదరీమణులకు జేఏసీ నాయకులు భరోసా కల్పించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News