విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్
విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి