Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:46 AM

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 07, 2026 07:03 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, విద్యార్థులు పడుకునే పడకలను పరిశీలించారు. భోజనశాల శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య గురించి వివరాలు తెలుసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

అలాగే మంచినీటి ఆర్‌.ఓ. ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News