Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 03:36 AM

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 07, 2026 07:03 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, విద్యార్థులు పడుకునే పడకలను పరిశీలించారు. భోజనశాల శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య గురించి వివరాలు తెలుసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

అలాగే మంచినీటి ఆర్‌.ఓ. ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News