విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
రామన్నపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, విద్యార్థులు పడుకునే పడకలను పరిశీలించారు. భోజనశాల శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య గురించి వివరాలు తెలుసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
అలాగే మంచినీటి ఆర్.ఓ. ప్లాంట్ను పరిశీలించి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి