Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:25 PM

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం
11-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేలపట్లలో ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమం.

టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

కూసుమంచి: మండలంలోని నేలపట్ల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.

అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఫ్యాన్లు, నేలపై కూర్చునేందుకు మ్యాట్లను అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ తెలిపారు.

చిన్నారులు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఆర్యవైశ్య సంఘం తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని సంఘ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాయల వీరస్వామి, మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు మరియు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అందరూ కలిసి “జై వాసవి… జై జై వాసవి” అంటూ నినాదాలు చేశారు.

Sthanikam

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

Article Image

నేలపట్లలో ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమం.

టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

కూసుమంచి: మండలంలోని నేలపట్ల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.

అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఫ్యాన్లు, నేలపై కూర్చునేందుకు మ్యాట్లను అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ తెలిపారు.

చిన్నారులు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఆర్యవైశ్య సంఘం తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని సంఘ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాయల వీరస్వామి, మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు మరియు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అందరూ కలిసి “జై వాసవి… జై జై వాసవి” అంటూ నినాదాలు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News