విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం
విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం
స్థానికం బృందం
నేలపట్లలో ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమం.
టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
కూసుమంచి: మండలంలోని నేలపట్ల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.
అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఫ్యాన్లు, నేలపై కూర్చునేందుకు మ్యాట్లను అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ తెలిపారు.
చిన్నారులు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఆర్యవైశ్య సంఘం తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని సంఘ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాయల వీరస్వామి, మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు మరియు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అందరూ కలిసి “జై వాసవి… జై జై వాసవి” అంటూ నినాదాలు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి