Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:31 PM

ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు

ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు

ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు
March 04, 2026 04:52 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ సోదాలు కలకలం రేపాయి. నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

మెస్ బిల్లుల మంజూరుకు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 28న ఆయన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, లెక్కల్లో చూపని రూ.1,84,070 నగదు పట్టుబడింది.

దర్యాప్తును విస్తరించిన అధికారులు తాజాగా శ్రీకాకుళం పట్టణంలోని ఆయనకు చెందిన రెండు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని నాలుగు స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి వస్తువులు, కొంత నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నరసన్నపేటతో పాటు సోంపేట విభాగానికి కూడా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బాల ముకుందరావు వసతిగృహాల మెస్ బిల్లులు మంజూరు చేయడానికి ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున వార్డెన్ల నుంచి లంచం వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News