ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు
ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు
GADDAM JAGANMOHAN REDDY
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ సోదాలు కలకలం రేపాయి. నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
మెస్ బిల్లుల మంజూరుకు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 28న ఆయన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, లెక్కల్లో చూపని రూ.1,84,070 నగదు పట్టుబడింది.
దర్యాప్తును విస్తరించిన అధికారులు తాజాగా శ్రీకాకుళం పట్టణంలోని ఆయనకు చెందిన రెండు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్రిజస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని నాలుగు స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి వస్తువులు, కొంత నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నరసన్నపేటతో పాటు సోంపేట విభాగానికి కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న బాల ముకుందరావు వసతిగృహాల మెస్ బిల్లులు మంజూరు చేయడానికి ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున వార్డెన్ల నుంచి లంచం వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి