Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:53 AM

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి
June 02, 2026 11:17 AM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో విషాదం..

విద్యుదాఘాతానికి 28 ఏళ్ల పావని బలి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెం లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మన్నబోయిన పావని (28) అనే వివాహిత మృతిచెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పావని తన ఇంటి వద్ద దండంపై బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా విద్యుత్ ప్రవాహానికి గురైంది. తీవ్రంగా షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యువ వివాహిత అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.పావని మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News