PRINT TIME: June 04, 2026 04:53 AM
దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్తో వివాహిత మృతి
దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్తో వివాహిత మృతి
June 02, 2026 11:17 AM
125 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాలలో విషాదం..
విద్యుదాఘాతానికి 28 ఏళ్ల పావని బలి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెం లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మన్నబోయిన పావని (28) అనే వివాహిత మృతిచెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పావని తన ఇంటి వద్ద దండంపై బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా విద్యుత్ ప్రవాహానికి గురైంది. తీవ్రంగా షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
యువ వివాహిత అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.పావని మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి