Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:07 AM

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
14-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు.

ఆసుపత్రులు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో కూడా ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.


Sthanikam

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

Article Image

జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు.

ఆసుపత్రులు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో కూడా ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News