జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
Editor Desk
జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు.
ఆసుపత్రులు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో కూడా ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి