జిల్లా టాపర్గా తాటి స్పందనగౌడ్
జిల్లా టాపర్గా తాటి స్పందనగౌడ్
Editor Desk
కన్నాయిగూడెం,
మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన తాటి స్పందనగౌడ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (ఎంఫీసీ) 470 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
కనకసేన గౌడ్, సరిత దంపతుల కుమార్తె అయిన స్పందనగౌడ్ సాధించిన ఈ ప్రతిభ మండలానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం కన్నాయిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఇంటి వద్ద ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం మండల అధ్యక్షుడు పాలకుర్తి శ్రీధర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు తాటి లచ్చాలు గౌడ్, నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, ముప్పెనపల్లి కేజీబివి లో చదివి జిల్లా టాపర్గా నిలవడం అభినందనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాటి రాజశేఖర్ గౌడ్, మారగోని రాజు గౌడ్, తాటి యాదగిరి గౌడ్, మారగోని శంకరయ్య గౌడ్, ముక్కెర సమ్మయ్య గౌడ్, ముక్కెర రాజు గౌడ్, ముక్కెర స్వామి గౌడ్, కోడూరు బాలుగౌడ్, చీకటి రాజు గౌడ్, కోడూరు చంటి గౌడ్, పానగంటి విక్రమ్ గౌడ్, తాటి కోటేష్ గౌడ్, శ్రీశాంత్ గౌడ్, తాటి మణి హార్శిత్ గౌడ్, తాటి మొక్సిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి