జిల్లా కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం
జిల్లా కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం
స్థానికం బృందం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులలతో కలిసి అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
జిల్లాలో మహిళల అభివృద్ధి, భద్రత, సాధికారత కోసం అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహరావు, పౌర సరఫరాల అధికారి రోజారాణి, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా మహిళలను సత్కరించి అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి