డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన
డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన
స్థానికం బృందం
కూకట్పల్లి, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్పల్లి కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని, నిత్య జీవితంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్గా హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్, కెరీర్ విశ్లేషకుడు, బ్లాగిస్ట్ డా. ఎ. దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన డిగ్రీ అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాటికి అవసరమైన వనరులు, మీడియా లింకులను విద్యార్థులకు వివరించారు. కెరీర్ ఎంపికలో సరైన దిశలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.
కెరీర్ గైడెన్స్ సెల్ బాధ్యులు ప్రొ. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దిశను నిర్దేశించేందుకు ప్రిన్సిపాల్ మద్దతుతో ఇలాంటి తరగతులను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మ, ఉమా, శర్మ, సుధీర్, లహారి, అర్చనతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా వినుతూ విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి