Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:10 PM

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన
11-03-2026 255 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూకట్‌పల్లి, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్‌పల్లి కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని, నిత్య జీవితంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్, కెరీర్ విశ్లేషకుడు, బ్లాగిస్ట్ డా. ఎ. దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన డిగ్రీ అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాటికి అవసరమైన వనరులు, మీడియా లింకులను విద్యార్థులకు వివరించారు. కెరీర్ ఎంపికలో సరైన దిశలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.

కెరీర్ గైడెన్స్ సెల్ బాధ్యులు ప్రొ. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దిశను నిర్దేశించేందుకు ప్రిన్సిపాల్ మద్దతుతో ఇలాంటి తరగతులను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మ, ఉమా, శర్మ, సుధీర్, లహారి, అర్చనతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా వినుతూ విజయవంతం చేశారు.

Sthanikam

డిగ్రీ తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన

Article Image

కూకట్‌పల్లి, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూకట్‌పల్లి కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని, నిత్య జీవితంలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్, కెరీర్ విశ్లేషకుడు, బ్లాగిస్ట్ డా. ఎ. దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన డిగ్రీ అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాటికి అవసరమైన వనరులు, మీడియా లింకులను విద్యార్థులకు వివరించారు. కెరీర్ ఎంపికలో సరైన దిశలో ముందుకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.

కెరీర్ గైడెన్స్ సెల్ బాధ్యులు ప్రొ. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దిశను నిర్దేశించేందుకు ప్రిన్సిపాల్ మద్దతుతో ఇలాంటి తరగతులను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పద్మ, ఉమా, శర్మ, సుధీర్, లహారి, అర్చనతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా వినుతూ విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News