డి. హెచ్. పి.ఎస్. జిల్లా అధ్యక్షురాలిగా ఇంజ హేమలత ఎన్నిక
డి. హెచ్. పి.ఎస్. జిల్లా అధ్యక్షురాలిగా ఇంజ హేమలత ఎన్నిక
Editor Desk
రాజపేట మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలుగా ఇంజ హేమలత ఎన్నిక అయ్యారు.
దళిత హక్కుల పోరాట సమితి భువనగిరి జిల్లా రెండవ మహా సభల మోత్కూరు మండలంలో జరుగగా ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, హేమలత సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేసే నేత అని పేర్కొన్నారు. దళితుల సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, పోరాట స్పూర్తి సంస్థను మరింత బలపరుస్తుందని తెలిపారు.ఇంజ హేమలత మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కి సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి లకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో దళితులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కఠినంగా పోరాడతానని, భూమి, విద్య, ఉపాధి, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి