ధాన్యం కొనుగోలు పై సమీక్ష: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ధాన్యం కొనుగోలు పై సమీక్ష: రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Komidala Mahender reddy
నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్, నకిరేకల్, కేతపల్లి మండలాల రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, రైతులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం తూకం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, చెల్లింపులను సమయానికి పూర్తి చేసి రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి