ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......
ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......
Harish HS
ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వం విఫలం.....
కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు శనివారం తమ్మర వద్ద కోదాడ,ఖమ్మం రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతలు కోసి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఒక పక్కన కమిషన్ ఏజెంట్లు,దళారులు, మిల్లర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రహదారిపై ధర్నా చేయడంతో ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణ, దొడ్డ వెంకటయ్య, రైతులు కమతం రాజేశ్వరరావు, వీరేపల్లి కృష్ణమూర్తి, బొమ్మ కంటి వీరబాబు, బైరాబోయిన వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి