Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:23 AM

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కోదాడ ఖమ్మం రహదారిపై ధర్నా......
April 11, 2026 05:13 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వం విఫలం.....


కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు శనివారం తమ్మర వద్ద కోదాడ,ఖమ్మం రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతలు కోసి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఒక పక్కన కమిషన్ ఏజెంట్లు,దళారులు, మిల్లర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రహదారిపై ధర్నా చేయడంతో ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణ, దొడ్డ వెంకటయ్య, రైతులు కమతం రాజేశ్వరరావు, వీరేపల్లి కృష్ణమూర్తి, బొమ్మ కంటి వీరబాబు, బైరాబోయిన వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News