Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

దేవరకొండలో అవినీతి  అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు
16-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో అవినీతి మరొకసారి బహిర్గతమైంది. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సైదులు, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… సంబంధిత పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం సైదులు కాంట్రాక్టర్‌ను లంచం కోరినట్లు సమాచారం. పలుమార్లు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సైదులను పట్టుకుంది.

దాడి అనంతరం సైదులుని అదుపులోకి తీసుకుని, అతని నివాసం మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో దేవరకొండలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

Sthanikam

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

Article Image

నల్గొండ జిల్లాలో అవినీతి మరొకసారి బహిర్గతమైంది. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సైదులు, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… సంబంధిత పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం సైదులు కాంట్రాక్టర్‌ను లంచం కోరినట్లు సమాచారం. పలుమార్లు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సైదులను పట్టుకుంది.

దాడి అనంతరం సైదులుని అదుపులోకి తీసుకుని, అతని నివాసం మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో దేవరకొండలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News