దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు
దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లాలో అవినీతి మరొకసారి బహిర్గతమైంది. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సైదులు, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… సంబంధిత పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం సైదులు కాంట్రాక్టర్ను లంచం కోరినట్లు సమాచారం. పలుమార్లు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సైదులను పట్టుకుంది.
దాడి అనంతరం సైదులుని అదుపులోకి తీసుకుని, అతని నివాసం మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో దేవరకొండలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి