Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:13 PM

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు

దేవరకొండలో అవినీతి  అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు
April 16, 2026 09:39 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో అవినీతి మరొకసారి బహిర్గతమైంది. దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సైదులు, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. విద్యుత్ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… సంబంధిత పనులకు అనుమతులు, బిల్లుల క్లియరెన్స్ కోసం సైదులు కాంట్రాక్టర్‌ను లంచం కోరినట్లు సమాచారం. పలుమార్లు ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కాంట్రాక్టర్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే సైదులను పట్టుకుంది.

దాడి అనంతరం సైదులుని అదుపులోకి తీసుకుని, అతని నివాసం మరియు కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనతో దేవరకొండలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News