Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 10:33 AM

దేవాలయాలకు ఇత్తడి దీపపు కుందులు, గంట విరాళం బోగారం గ్రామ దాతృత్వానికి నిదర్శనంగా కాంజోజు వెంకటాచారి కుటుంబం

దేవాలయాలకు ఇత్తడి దీపపు కుందులు, గంట విరాళం బోగారం గ్రామ దాతృత్వానికి నిదర్శనంగా కాంజోజు వెంకటాచారి కుటుంబం

దేవాలయాలకు ఇత్తడి దీపపు కుందులు, గంట విరాళం బోగారం గ్రామ దాతృత్వానికి నిదర్శనంగా కాంజోజు వెంకటాచారి కుటుంబం
July 20, 2026 05:59 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 20: మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంజోజు వెంకటాచారి (తండ్రి: నర్సింహాచారి) కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలకు సుమారు రూ.3 వేల విలువైన రెండు ఇత్తడి దీపపు కుందులు, ఒక గంటను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా దేవాలయాల ప్రధాన అర్చకుడు నిరంజన్ విరాళాలను స్వీకరించి, దాత కుటుంబ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, కాంజోజు వెంకటాచారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

దాత కుటుంబంపై శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News