రామన్నపేట, జూలై 20: మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంజోజు వెంకటాచారి (తండ్రి: నర్సింహాచారి) కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలకు సుమారు రూ.3 వేల విలువైన రెండు ఇత్తడి దీపపు కుందులు, ఒక గంటను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా దేవాలయాల ప్రధాన అర్చకుడు నిరంజన్ విరాళాలను స్వీకరించి, దాత కుటుంబ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, కాంజోజు వెంకటాచారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
దాత కుటుంబంపై శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి