డీజీపీ కార్యాలయంలో విషాదం.. స్వగ్రామానికి చేరిన స్వామి మృతదేహం
డీజీపీ కార్యాలయంలో విషాదం.. స్వగ్రామానికి చేరిన స్వామి మృతదేహం
Komidala Mahender reddy
వెలిమినేడులో శోకసంద్రం.. క్యాండిల్ ర్యాలీతో ఘన నివాళి.. నేడు అంత్యక్రియలు.
చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన స్వామి డీజీపీ కార్యాలయంలో గురువారం సర్వీస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లో పోస్టుమార్టం అనంతరం స్వామి మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్లో స్వగ్రామమైన వెలిమినేడుకు తీసుకువచ్చారు.మృతదేహం గ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు.
గ్రామమంతా శోకసంద్రంగా మారగా, స్వామికి నివాళులర్పించేందుకు వందలాది మంది గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని నిశ్శబ్దంగా సాగిన ర్యాలీ హృదయ విదారక వాతావరణాన్ని సృష్టించింది.స్వామి అంత్యక్రియలు శుక్రవారం వెలిమినేడు గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి