దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష
దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకోవాలని యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లికి చెందిన సురేష్ సోమందేపల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజు దుకాణం డబ్బును తన గ్రామానికి తీసుకెళ్లే అలవాటు ఉండేది.
ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు గత సంవత్సరం నవంబర్ 12 రాత్రి పాపిరెడ్డిపల్లి సమీపంలో సురేష్పై కారంపొడి చల్లి దాడి చేసి డబ్బు దోచుకోవాలని ప్రయత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సోమందేపల్లి ఎస్ఐ రమేష్బాబు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన నిందితులు నాగార్జునరెడ్డి, ప్రేమకుమార్, నందలను శనివారం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 15 రోజుల జైలు శిక్ష విధించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్బాబు మాట్లాడుతూ, గంజాయి వినియోగం, మద్యం సేవించి గొడవలు చేయడం, మత్తు పదార్థాలు వాడి అల్లర్లు సృష్టించడం వంటి సంఘ విద్రోహ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి