Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష
07-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకోవాలని యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లికి చెందిన సురేష్ సోమందేపల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజు దుకాణం డబ్బును తన గ్రామానికి తీసుకెళ్లే అలవాటు ఉండేది.

ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు గత సంవత్సరం నవంబర్ 12 రాత్రి పాపిరెడ్డిపల్లి సమీపంలో సురేష్‌పై కారంపొడి చల్లి దాడి చేసి డబ్బు దోచుకోవాలని ప్రయత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సోమందేపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన నిందితులు నాగార్జునరెడ్డి, ప్రేమకుమార్, నందలను శనివారం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 15 రోజుల జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ, గంజాయి వినియోగం, మద్యం సేవించి గొడవలు చేయడం, మత్తు పదార్థాలు వాడి అల్లర్లు సృష్టించడం వంటి సంఘ విద్రోహ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు


Sthanikam

దారి దోపిడీకి యత్నించిన వారికి జైలు శిక్ష

Article Image

సోమందేపల్లి: కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకోవాలని యత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లికి చెందిన సురేష్ సోమందేపల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజు దుకాణం డబ్బును తన గ్రామానికి తీసుకెళ్లే అలవాటు ఉండేది.

ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు గత సంవత్సరం నవంబర్ 12 రాత్రి పాపిరెడ్డిపల్లి సమీపంలో సురేష్‌పై కారంపొడి చల్లి దాడి చేసి డబ్బు దోచుకోవాలని ప్రయత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సోమందేపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన నిందితులు నాగార్జునరెడ్డి, ప్రేమకుమార్, నందలను శనివారం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 15 రోజుల జైలు శిక్ష విధించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ, గంజాయి వినియోగం, మద్యం సేవించి గొడవలు చేయడం, మత్తు పదార్థాలు వాడి అల్లర్లు సృష్టించడం వంటి సంఘ విద్రోహ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News