డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల
డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల
Editor Desk
చెత్త, దోమలతో ఆరోగ్య సమస్యలు… స్పందించని అధికారులు.
వార్డు సభ్యుడు గంజి భాస్కర్
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని 11వ వార్డులో మురికినీటి సమస్య తీవ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివాలయం సమీపంలో గ్రామ పంచాయితీ నుంచి గంజి భాస్కర్ ఇంటి వెనుకుగా ప్రవహిస్తున్న మురికినీరు మూసీనదిని తలపించేలా ఉంది.
దాదాపు 150 ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు, స్నానాలు, పాత్రలు కడిగిన నీరు ఒకేచోట చేరి ఏరులా పారుతోంది. అందులో ప్లాస్టిక్ గ్లాసులు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో పరిసరాలు అసహనంగా మారాయి. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.
ప్రస్తుత, గత సర్పంచ్లు సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై తీసిన ఫోటోలను పరిశీలించి నిజానిజాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు గంజి భాస్కర్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి