Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల
01-04-2026 643 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెత్త, దోమలతో ఆరోగ్య సమస్యలు… స్పందించని అధికారులు.

వార్డు సభ్యుడు గంజి భాస్కర్

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని 11వ వార్డులో మురికినీటి సమస్య తీవ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివాలయం సమీపంలో గ్రామ పంచాయితీ నుంచి గంజి భాస్కర్ ఇంటి వెనుకుగా ప్రవహిస్తున్న మురికినీరు మూసీనదిని తలపించేలా ఉంది.

దాదాపు 150 ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు, స్నానాలు, పాత్రలు కడిగిన నీరు ఒకేచోట చేరి ఏరులా పారుతోంది. అందులో ప్లాస్టిక్ గ్లాసులు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో పరిసరాలు అసహనంగా మారాయి. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.

ప్రస్తుత, గత సర్పంచ్‌లు సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై తీసిన ఫోటోలను పరిశీలించి నిజానిజాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు గంజి భాస్కర్ కోరారు.

Sthanikam

డ్రైనేజీ సమస్యతో వెల్లంకి వాసుల విలవిల

Article Image

చెత్త, దోమలతో ఆరోగ్య సమస్యలు… స్పందించని అధికారులు.

వార్డు సభ్యుడు గంజి భాస్కర్

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని 11వ వార్డులో మురికినీటి సమస్య తీవ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివాలయం సమీపంలో గ్రామ పంచాయితీ నుంచి గంజి భాస్కర్ ఇంటి వెనుకుగా ప్రవహిస్తున్న మురికినీరు మూసీనదిని తలపించేలా ఉంది.

దాదాపు 150 ఇళ్ల నుంచి వస్తున్న డ్రైనేజీ నీరు, స్నానాలు, పాత్రలు కడిగిన నీరు ఒకేచోట చేరి ఏరులా పారుతోంది. అందులో ప్లాస్టిక్ గ్లాసులు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో పరిసరాలు అసహనంగా మారాయి. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.

ప్రస్తుత, గత సర్పంచ్‌లు సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై తీసిన ఫోటోలను పరిశీలించి నిజానిజాలు తెలుసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు గంజి భాస్కర్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News