డ్రగ్స్కు 'నో'.. భవిష్యత్తుకు 'యెస్'!
డ్రగ్స్కు 'నో'.. భవిష్యత్తుకు 'యెస్'!
K.RAVI
చౌటుప్పల్లో విద్యార్థులు, యువతతో పోలీసుల భారీ అవగాహన సదస్సు
యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ, చౌటుప్పల్ డీఎస్పీ ఆదేశాలు, మార్గదర్శకత్వంలో, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో వీవీఆర్ గార్డెన్స్లో విద్యార్థులు, యువత కోసం ఆంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, సమాజం, భవిష్యత్తుపై కలిగే తీవ్ర దుష్పరిణామాలను వివరించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలని, ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి