డ్రగ్స్కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.
డ్రగ్స్కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.
Editor Desk
అనంతారంలో యువతకు అవగాహన కల్పించిన భువనగిరి రూరల్ పోలీసులు..
భువనగిరి, జూలై 20:
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్ఐ అనిల్కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామంలో సోమవారం నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు దెబ్బతింటాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెపాటి నాగరాణి–రాజలింగం, ఉపసర్పంచ్ వడ్డెబోయిన వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేష్, సల్ల పాండు, మచ్చ శంకర్, గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి