Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి దొంగల హల్చల్.. రైతుల్లో ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 10:50 AM

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతే సమాజానికి బలం.
July 20, 2026 09:01 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనంతారంలో యువతకు అవగాహన కల్పించిన భువనగిరి రూరల్ పోలీసులు..

భువనగిరి, జూలై 20:

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్‌ఐ అనిల్‌కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామంలో సోమవారం నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు దెబ్బతింటాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెపాటి నాగరాణి–రాజలింగం, ఉపసర్పంచ్ వడ్డెబోయిన వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ విఠల్ వెంకటేష్, సల్ల పాండు, మచ్చ శంకర్, గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News