సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవీలే ఉపేందర్, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాలు నాయక్, సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిడమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తప్పేట్ల శ్రీరాములు ఎంఆర్పీఎస్ నాయకుడు, షేక్ జానీ దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 03, 2026 11:10 AM
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
14-04-2026
73 Views
స్థానికం ప్రతినిధి :
Suryapet
Vikram Journalist
సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవీలే ఉపేందర్, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాలు నాయక్, సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిడమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తప్పేట్ల శ్రీరాములు ఎంఆర్పీఎస్ నాయకుడు, షేక్ జానీ దూదేకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి