డా. నోముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు
డా. నోముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు
స్థానికం బృందం
హైదరాబాద్, మానసిక ఆరోగ్య సేవలలో విశేష కృషి చేసినందుకు గాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హయత్నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రముఖ సైకాలజిస్టు డా. నోముల వెంకటేశ్వర్లు కు “తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు – 2026” అందజేయనున్నారు.
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్ లో మార్చి 8న ఉదయం నిర్వహించనున్న 38వ సేవా ఉగాది మహోత్సవం – అవార్డుల సన్మాన సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సర్ సి.వి. రామన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డును అందజేయగా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందించడం, సమాజంలో మానసిక ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభిస్తోంది. గతంలో కూడా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ నుంచి 2025 సంవత్సరానికి గాను “తెలంగాణ బెస్ట్ సైకాలజిస్టు అవార్డు” అందుకున్నారు.
ఈ సందర్భంగా జీడీసీ హయత్నగర్ ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు, మానసిక ఆరోగ్య కార్యకర్తలు మరియు పలువురు మేధావులు డా. నోముల వెంకటేశ్వర్లును అభినందించారు.
కార్యక్రమానికి విద్యావేత్తలు, సామాజిక సేవకులు, సాంస్కృతిక ప్రముఖులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి