Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 08:14 PM

చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
April 20, 2026 05:43 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, సోమవారం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆదోని టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పెద్దశక్తి గుడి అంబా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, టూ టౌన్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్ల వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు ఉచిత భోజన వసతి కల్పించారు. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఉమాపతి నాయుడు, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద సిద్ధార్థ నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, ప్రణీత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

శ్రీనివాస్ భవన్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, యువనాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శివప్ప పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. భువనేశ్వర్ అమ్మగారు అన్న క్యాంటీన్‌కు రూ.76 లక్షల విరాళం అందజేయడం విశేషమన్నారు.

కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సీఎం‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News