Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:41 AM

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర
07-03-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారాన్ని బలపరిచిన పథకమని అన్నారు. ఈ పథకం వల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గి పేదలకు పని భరోసా లభించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను నిర్ణయించి, కార్మికులకు పని కల్పించే విధానం ఈ పథకంలో ఉండేదని చెప్పారు. పురుషులు, మహిళలకు సమాన వేతనం, పని అడిగిన వారికి నిర్ణీత కాలంలో పని కల్పించే హక్కు ఉండేదని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఉపాధి హామీ పథకం బలహీనపడిందని విమర్శించారు. గ్రామాల్లో జరిగే పనులపై స్థానిక నిర్ణయాధికారాన్ని తగ్గించి కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం పెంచుతున్నారని ఆరోపించారు. పేదల జీవనాధారమైన ఉపాధి పథకాన్ని బలహీనపరచడం సరైంది కాదని అన్నారు.

రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలపై రాష్ట్ర నాయకులు గట్టిగా స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ పథకాలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆమె కోరారు.

Sthanikam

చింతలపూడి మండలం యర్రంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

Article Image

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారాన్ని బలపరిచిన పథకమని అన్నారు. ఈ పథకం వల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గి పేదలకు పని భరోసా లభించిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో అవసరమైన పనులను నిర్ణయించి, కార్మికులకు పని కల్పించే విధానం ఈ పథకంలో ఉండేదని చెప్పారు. పురుషులు, మహిళలకు సమాన వేతనం, పని అడిగిన వారికి నిర్ణీత కాలంలో పని కల్పించే హక్కు ఉండేదని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో ఉపాధి హామీ పథకం బలహీనపడిందని విమర్శించారు. గ్రామాల్లో జరిగే పనులపై స్థానిక నిర్ణయాధికారాన్ని తగ్గించి కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం పెంచుతున్నారని ఆరోపించారు. పేదల జీవనాధారమైన ఉపాధి పథకాన్ని బలహీనపరచడం సరైంది కాదని అన్నారు.

రాష్ట్రానికి నష్టం కలిగించే నిర్ణయాలపై రాష్ట్ర నాయకులు గట్టిగా స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ పథకాలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఆమె కోరారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News