చిట్యాలలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ప్రసాద పంపిణీ
చిట్యాలలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ప్రసాద పంపిణీ
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి, శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు పండి ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.ఈ ప్రత్యేక పూజా, ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి