Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:17 PM

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి
March 04, 2026 10:56 AM 221 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక పూజలు – నూతన పట్టు వస్త్రాలు సమర్పణ

చిట్యాల పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఆలయ నిర్మాణం పూర్తై నేటితో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బొబ్బలి పాండు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మూడ సుదర్శన్, పోలా బాషయ్య, కీర్తిశేషులు వెలుపల్లి సుదర్శన్, దేవరపల్లి భగవంత రెడ్డి, కీర్తిశేషులు యాస మల్లారెడ్డి, మూడ వెంకటాద్రి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, పోల నవీన్ కుమార్ తదితరులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మవారి కృపాకటాక్షాలతో చిట్యాల పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News