Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతుడికి ఘన నివాళి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన దైద రవీందర్ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:23 PM

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి

చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి
March 04, 2026 10:56 AM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక పూజలు – నూతన పట్టు వస్త్రాలు సమర్పణ

చిట్యాల పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఆలయ నిర్మాణం పూర్తై నేటితో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బొబ్బలి పాండు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మూడ సుదర్శన్, పోలా బాషయ్య, కీర్తిశేషులు వెలుపల్లి సుదర్శన్, దేవరపల్లి భగవంత రెడ్డి, కీర్తిశేషులు యాస మల్లారెడ్డి, మూడ వెంకటాద్రి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, పోల నవీన్ కుమార్ తదితరులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మవారి కృపాకటాక్షాలతో చిట్యాల పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News