చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి
చిట్యాల శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి 23 ఏళ్లు పూర్తి
Komidala Mahender reddy
నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక పూజలు – నూతన పట్టు వస్త్రాలు సమర్పణ
చిట్యాల పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఆలయ నిర్మాణం పూర్తై నేటితో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బొబ్బలి పాండు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మూడ సుదర్శన్, పోలా బాషయ్య, కీర్తిశేషులు వెలుపల్లి సుదర్శన్, దేవరపల్లి భగవంత రెడ్డి, కీర్తిశేషులు యాస మల్లారెడ్డి, మూడ వెంకటాద్రి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, పోల నవీన్ కుమార్ తదితరులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మవారి కృపాకటాక్షాలతో చిట్యాల పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి