Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:29 AM

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన
30-01-2026 1,193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థుల జాబితాను జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చిట్యాలమున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటిలో మొదటి వార్డును CPM పార్టీకి కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకత్వం వెల్లడించింది. మిగిలిన వార్డులపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పట్టించుకునే నాయకత్వాన్ని అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా చూపుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబిత ప్రకటన

Article Image


నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థుల జాబితాను జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చిట్యాలమున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటిలో మొదటి వార్డును CPM పార్టీకి కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకత్వం వెల్లడించింది. మిగిలిన వార్డులపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పట్టించుకునే నాయకత్వాన్ని అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా చూపుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News