Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:01 AM

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు
February 22, 2026 06:15 PM 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని రైతులకు యూరియా సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. వెలిమినేడు, చిట్యాల, గుండ్రంపల్లి ప్రాంతాల్లో ఉన్న మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 900 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. అదనంగా గ్రోమోర్ సెంటర్లు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా 300 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెప్పారు.మండలానికి ఇంకా 300 మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నప్పటికీ, 500 మెట్రిక్ టన్నుల వరకు అదనంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ రైతు గ్రూపుల ద్వారా సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.రైతులు తప్పనిసరిగా “యూరియా యాప్” ద్వారా బుకింగ్ చేసుకుని సంబంధిత డీలర్ల వద్ద నుండి ఎరువును తీసుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల పూర్తి పారదర్శకత ఉండడంతో పాటు ప్రతి బస్తాకు లెక్క ఉండి యూరియా పక్కదారి పడకుండా నివారించవచ్చని తెలిపారు. యాప్ వినియోగంలో ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా PACS సిబ్బందిని సంప్రదించవచ్చన్నారు.

ప్రస్తుతం వరి పంట పొట్ట దశలోకి ప్రవేశిస్తున్నందున ఎకరానికి 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలని, అధిక మోతాదులో యూరియా వాడితే పంటకు నష్టం జరుగుతుందని రైతులకు సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా యాప్ విధానాన్ని అనుసరించి ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News