Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు

చిట్యాల మండలంలో యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు
February 22, 2026 06:15 PM 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని రైతులకు యూరియా సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. వెలిమినేడు, చిట్యాల, గుండ్రంపల్లి ప్రాంతాల్లో ఉన్న మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 900 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. అదనంగా గ్రోమోర్ సెంటర్లు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా 300 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెప్పారు.మండలానికి ఇంకా 300 మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నప్పటికీ, 500 మెట్రిక్ టన్నుల వరకు అదనంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ రైతు గ్రూపుల ద్వారా సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.రైతులు తప్పనిసరిగా “యూరియా యాప్” ద్వారా బుకింగ్ చేసుకుని సంబంధిత డీలర్ల వద్ద నుండి ఎరువును తీసుకోవాలని సూచించారు. ఈ విధానం వల్ల పూర్తి పారదర్శకత ఉండడంతో పాటు ప్రతి బస్తాకు లెక్క ఉండి యూరియా పక్కదారి పడకుండా నివారించవచ్చని తెలిపారు. యాప్ వినియోగంలో ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా PACS సిబ్బందిని సంప్రదించవచ్చన్నారు.

ప్రస్తుతం వరి పంట పొట్ట దశలోకి ప్రవేశిస్తున్నందున ఎకరానికి 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలని, అధిక మోతాదులో యూరియా వాడితే పంటకు నష్టం జరుగుతుందని రైతులకు సూచించారు. రైతులు ఆందోళన చెందకుండా యాప్ విధానాన్ని అనుసరించి ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News