చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు
చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు
Komidala Mahender reddy
ఏపూరు గ్రామపంచాయతీ పరిధిలో మద్యం మరియు మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కీలక తీర్మానం ఆమోదించబడింది. గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్థుల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది.గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల యజమానులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి, గ్రామాభివృద్ధి మరియు యువత సంక్షేమం కోసం మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని సర్పంచ్ స్పష్టంచేశారు. గ్రామ శాంతి భద్రతలు, కుటుంబ వ్యవస్థల పరిరక్షణ, యువతలో పెరుగుతున్న వ్యసనాల నియంత్రణ వంటి అంశాలను వివరిస్తూ అవగాహన కల్పించారు.
సర్పంచ్ పిలుపుకు స్పందించిన బెల్ట్ షాప్ నిర్వాహకులందరూ రేపటి నుంచే గ్రామ పరిధిలో ఎలాంటి మద్యం లేదా మత్తు పదార్థాల విక్రయం జరపబోమని హామీ ఇచ్చారు. ఈ మేరకు సర్పంచ్ సమక్షంలో లిఖితపూర్వకంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు గ్రామపంచాయతీ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.గ్రామంలో ఇకపై ఎవరైనా గుప్తంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ హెచ్చరించింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి