Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:21 PM

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు

చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులకు ముగింపు
March 04, 2026 02:04 PM 595 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఏపూరు గ్రామపంచాయతీ పరిధిలో మద్యం మరియు మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కీలక తీర్మానం ఆమోదించబడింది. గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్థుల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది.గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల యజమానులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి, గ్రామాభివృద్ధి మరియు యువత సంక్షేమం కోసం మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని సర్పంచ్ స్పష్టంచేశారు. గ్రామ శాంతి భద్రతలు, కుటుంబ వ్యవస్థల పరిరక్షణ, యువతలో పెరుగుతున్న వ్యసనాల నియంత్రణ వంటి అంశాలను వివరిస్తూ అవగాహన కల్పించారు.

సర్పంచ్ పిలుపుకు స్పందించిన బెల్ట్ షాప్ నిర్వాహకులందరూ రేపటి నుంచే గ్రామ పరిధిలో ఎలాంటి మద్యం లేదా మత్తు పదార్థాల విక్రయం జరపబోమని హామీ ఇచ్చారు. ఈ మేరకు సర్పంచ్ సమక్షంలో లిఖితపూర్వకంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు గ్రామపంచాయతీ తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.గ్రామంలో ఇకపై ఎవరైనా గుప్తంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ హెచ్చరించింది.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News