Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్  జయంతి ఉత్సవాలు
15-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ మరియు మండలంలోని పలు గ్రామాల్లో,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభల్లో మాట్లాడుతూ నాయకులు, ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఇప్పటి భారతదేశం అంబేద్కర్ ఆశయాల దిశగా ముందుకు సాగుతోందని, ప్రతి పౌరుడు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనిసూచించారు.మండల వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ , వైస్ చైర్మన్ గుండుబోయిన శ్రీ లక్ష్మీ ,సైదులు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు ఆరెగూడెం సర్పంచ్, నాగంపల్లి శ్యాంసుందర్, చిన్న కాపర్తి సర్పంచ్, ఆవుల సుందర్, బోయగుబ్బ సర్పంచ్ రేగులగడ్డ స్వామి, గుండ్రంపల్లి సర్పంచ్ , బత్తుల లక్ష్మీ ప్రసన్న నరసింహ, , వేoబాయి సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మండల వ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ మరియు మండలంలోని పలు గ్రామాల్లో,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభల్లో మాట్లాడుతూ నాయకులు, ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఇప్పటి భారతదేశం అంబేద్కర్ ఆశయాల దిశగా ముందుకు సాగుతోందని, ప్రతి పౌరుడు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనిసూచించారు.మండల వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ , వైస్ చైర్మన్ గుండుబోయిన శ్రీ లక్ష్మీ ,సైదులు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు ఆరెగూడెం సర్పంచ్, నాగంపల్లి శ్యాంసుందర్, చిన్న కాపర్తి సర్పంచ్, ఆవుల సుందర్, బోయగుబ్బ సర్పంచ్ రేగులగడ్డ స్వామి, గుండ్రంపల్లి సర్పంచ్ , బత్తుల లక్ష్మీ ప్రసన్న నరసింహ, , వేoబాయి సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News