చిట్యాల: పట్టణానికి చెందిన జిట్ట వెంకన్న దంపతుల కుమార్తె జిట్టా శ్రీ చైతన్య విద్యలో ప్రతిభ కనబరిచి అకాడమీ టాపర్గా నిలిచింది. ఆమె Brilliant Institute of Engineering and Technology, అబ్దుల్లాపూర్మెట్ లో సీఎస్డీ బ్రాంచ్లో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది.
2025–26 విద్యా సంవత్సరానికి గాను కళాశాల యాజమాన్యం ఆమెను అకాడమీ టాపర్గా గుర్తించి గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ పురస్కారాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె. దుర్గా ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ రుస్తుం అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీ చైతన్యను కళాశాల అధ్యాపకులు అభినందించారు. తమ కుమార్తె సాధించిన ఈ విజయంపై తల్లిదండ్రులు వెంకన్న దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి