చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు
చిట్యాల ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపు 220 మందికి వైద్య సేవలు
Komidala Mahender reddy
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు.ఈ హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ (స్త్రీల వ్యాధి నిపుణులు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్య నిపుణులు), పీడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణులు), ఆఫ్తాల్మాలజిస్ట్ (కంటి వైద్య నిపుణులు), డెంటిస్ట్ (పళ్ల వైద్య నిపుణులు) సేవలు అందించారు. సుమారు 220 మందికి పైగా రోగులను పరీక్షించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.కార్యక్రమంలో పీహెచ్సీ బృందం వైద్యులు డాక్టర్ ఈసం వెంకటేశం, డాక్టర్ సత్యనరేష్, సిహెచ్ఓ నర్సింగ్ రావు, పీహెచ్ఎన్ కమల కుమారి, సూపర్వైజర్లుసత్యనారాయణ,వెంకటరమణమ్మ, ఎల్టితో పాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి