Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:40 PM

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’
April 11, 2026 06:15 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇప్పటికే ధాన్యం బస్తాలు కాంటపెట్టి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, మరో కొత్త సమస్య తలెత్తింది. ఐకెపి సెంటర్ల సూచనల మేరకు లోడింగ్ కోసం వెళ్లిన లారీలు ధాన్యాన్ని ఎత్తుకుని రైస్ మిల్లులకు చేరుకున్నా, అక్కడ అన్లోడింగ్‌కుఅనుమతించకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.చిట్యాల పరిధిలోని సిద్ధార్థ, ఉదయ, హనుమాన్, పరమేశ్వరి, లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లులకు చేరుకున్న లారీలను మిల్లర్లు అన్లోడ్ చేయబోమని స్పష్టం చేయడం గమనార్హం. దీంతో లారీ డ్రైవర్లు రోడ్డుపై నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే రైతులు ధాన్యం నిల్వ సమస్యతో ఆందోళన చెందుతుండగా, మిల్లర్ల నిరాకరణతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

“మేము ఐకెపి సెంటర్ల సూచనల మేరకు ధాన్యం లోడింగ్ చేసి మిల్లులకు తీసుకువచ్చాం. కానీ ఇక్కడ అన్లోడ్ చేయమని చెబుతున్నారు. మా లారీలు నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి” అని లారీ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News