Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:25 PM

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’

చిట్యాల ఐకెపి ధాన్యం సంక్షోభం: లోడింగ్ చేసిన లారీలకు రైస్ మిల్లుల్లో ‘నో ఎంట్రీ’
April 11, 2026 06:15 PM 599 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల మండల పరిధిలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇప్పటికే ధాన్యం బస్తాలు కాంటపెట్టి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, మరో కొత్త సమస్య తలెత్తింది. ఐకెపి సెంటర్ల సూచనల మేరకు లోడింగ్ కోసం వెళ్లిన లారీలు ధాన్యాన్ని ఎత్తుకుని రైస్ మిల్లులకు చేరుకున్నా, అక్కడ అన్లోడింగ్‌కుఅనుమతించకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.చిట్యాల పరిధిలోని సిద్ధార్థ, ఉదయ, హనుమాన్, పరమేశ్వరి, లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లులకు చేరుకున్న లారీలను మిల్లర్లు అన్లోడ్ చేయబోమని స్పష్టం చేయడం గమనార్హం. దీంతో లారీ డ్రైవర్లు రోడ్డుపై నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే రైతులు ధాన్యం నిల్వ సమస్యతో ఆందోళన చెందుతుండగా, మిల్లర్ల నిరాకరణతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

“మేము ఐకెపి సెంటర్ల సూచనల మేరకు ధాన్యం లోడింగ్ చేసి మిల్లులకు తీసుకువచ్చాం. కానీ ఇక్కడ అన్లోడ్ చేయమని చెబుతున్నారు. మా లారీలు నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి” అని లారీ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News