Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:30 AM

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..

చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ..
April 19, 2026 01:55 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు బొమ్మలరామారం మండలంలోని చౌదర్పల్లి, మర్యాల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ శైలజ గర్భిణులు, బాలింత తల్లులకు చిరుధాన్యాల వినియోగం, వాటి పోషక విలువలపై వివరించారు. మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంత ముఖ్యమో చెప్పి, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అన్వర్నిసా బేగం, సర్పంచ్ కూర వెంకటేష్, సంగి గణేష్, ఉపసర్పంచ్ చెన్నమలు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వరమ్మ, రాజమణి, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News