చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్లో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
చిన్నంపేట సిద్ధార్థ హై స్కూల్లో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేటలోని సిద్ధార్థ హై స్కూల్లో కబ్ కోడర్స్ ఆధ్వర్యంలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ పలగాని శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం అత్యంత అవసరమని, కంప్యూటర్ విద్య ద్వారా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ విద్యార్థులలో కోడింగ్, ప్రోగ్రామింగ్ మరియు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన సీవో తిరుపతి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ కల్పన ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ముసునూరు జెడ్పీటీసీ మరియు ఆచార్య ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ వరికూటి ప్రతాప్, గన్నవరం నవోదయ కోచింగ్ సెంటర్ విశ్వభారతి ఎస్.డి.లాల్, తూర్పు దిగవల్లి సర్పంచ్ మరియు వైష్ణవి విద్యా సంస్థల చైర్మన్ నాని, వీరపనేనిగూడెం గణేష్ యూపీ స్కూల్ కరస్పాండెంట్ ఆనంద్ సాగర్ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభాన్ని స్వాగతించారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, విద్యార్థుల భవిష్యత్కు కొత్త దిశగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి