Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 03:46 PM

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన సర్పంచ్ విక్రమ్
April 21, 2026 01:35 PM 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన “పోషణ పక్వాడా” కార్యక్రమం, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ప్రీ-స్కూల్ సర్టిఫికెట్లను సర్పంచ్ విక్రమ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సూపర్వైజర్ హేమలత గర్భిణీలు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మల్లేశం, అంగన్వాడీ టీచర్లు బి.సుజాత, ఎం.రేణుక, కె.మంజుల, టి.సావిత్రి, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News