Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మ్యారేజ్ బ్యూరోల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 09:45 AM

చిన్నారికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం...

చిన్నారికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం...

చిన్నారికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం...
July 22, 2026 06:51 AM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్నారి వడ్లమూడి దక్షిక కు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. కోదాడ పట్టణంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న వడ్లమూడి దక్షిక కాలేయం సమస్యతో ఇబ్బంది పడుతుంది. చికిత్స కోసం 30 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన దక్షిక తల్లితండ్రులు వైద్యం చేపించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతల సహాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమస్యను తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చిన్నారి ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో సలిగంటి మురళి, పిడమర్తి గాంధీ, కుడుముల సైదులు, మరికంటి లక్ష్మణ్, వెన్నెబోయిన పూర్ణ చందర్ రావు,నజీర్,చెరుకుపల్లి శ్రీకాంత్, తోటపల్లి నాగరాజు, గంధం వెంకటనారాయణ, వాసు, సంపత్, పల్లపు శ్రీను, నజీర్,కోలా వెంకట్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News