Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:26 PM

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు
March 04, 2026 03:54 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన వేడుక

నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రాసన వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన బోయిన గోపి–మాధవి దంపతుల కుమార్తె పవన్ శ్రీ అన్నప్రాసన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్, ఆహార నాణ్యతపై సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా పోషకాహారం అందించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమ్ కుమార్, అంగన్వాడి టీచర్లు సూరేపల్లి సుజాత, ఎన్నబోయిన విజయ, శ్రీలత సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా హాజరై వేడుకను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News