Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:07 PM

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు

చిన్నారి పవన్ శ్రీకు ఆశీస్సులు అందించిన సర్పంచ్ బోయిన వేణు
March 04, 2026 03:54 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన వేడుక

నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామ అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రాసన వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన బోయిన గోపి–మాధవి దంపతుల కుమార్తె పవన్ శ్రీ అన్నప్రాసన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్, ఆహార నాణ్యతపై సిబ్బందితో మాట్లాడారు. పిల్లలకు అందించే ఆహారంలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా పోషకాహారం అందించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూరేపల్లి ప్రేమ్ కుమార్, అంగన్వాడి టీచర్లు సూరేపల్లి సుజాత, ఎన్నబోయిన విజయ, శ్రీలత సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా హాజరై వేడుకను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News