Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 12:51 PM

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఆలయ అధికారులు

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఆలయ అధికారులు

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఆలయ అధికారులు
January 19, 2026 07:47 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఆలయ అధికారులు

జనవరి 23 నుండి 30 తేదీలలో జరగబోయే చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, సోమవారం రోజున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. అనంతరం ఆలయ పాలకవర్గం కార్యనిర్వహణ అధికారి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కు అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ బ్రహ్మోత్సవములకు సంబందించిన ఏర్పాట్ల వివరములు తెలసుకున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని వారికి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని శాఖల సహకారంతో తగు ఏర్పాట్లు చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు బ్రహ్మోత్సవాలలో ఎటువంటి సమస్యలు ఏర్పడిన తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్బాబు, దేవాలయ ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News