Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 10:00 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్
April 20, 2026 08:02 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ గుడి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ముగుదాల పావని రమేష్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.

డిప్యూటీ డాక్టర్ యశోద మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారికి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు.

ఈ శిబిరంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ వినయ్, శ్రీనివాసరావు (ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), మోహన్ రెడ్డి (ఏడీఓ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్), డాక్టర్ సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి), కాటమరాజు (మెడికల్ ఆఫీసర్, తంగేడుపల్లి) తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది సేవలందించారు.

శిబిరంలో మొత్తం 205 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 65 మంది, ఆర్థోపెడిక్ సమస్యలకు 77 మంది, కంటి సంబంధిత సమస్యలకు 63 మంది చికిత్స పొందారు. అవసరమైన ఆరుగురిని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News