Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:14 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్
20-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ గుడి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ముగుదాల పావని రమేష్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.

డిప్యూటీ డాక్టర్ యశోద మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారికి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు.

ఈ శిబిరంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ వినయ్, శ్రీనివాసరావు (ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), మోహన్ రెడ్డి (ఏడీఓ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్), డాక్టర్ సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి), కాటమరాజు (మెడికల్ ఆఫీసర్, తంగేడుపల్లి) తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది సేవలందించారు.

శిబిరంలో మొత్తం 205 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 65 మంది, ఆర్థోపెడిక్ సమస్యలకు 77 మంది, కంటి సంబంధిత సమస్యలకు 63 మంది చికిత్స పొందారు. అవసరమైన ఆరుగురిని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశారు.

Sthanikam

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్

Article Image

చౌటుప్పల్,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ గుడి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ముగుదాల పావని రమేష్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.

డిప్యూటీ డాక్టర్ యశోద మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారికి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు.

ఈ శిబిరంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ వినయ్, శ్రీనివాసరావు (ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), మోహన్ రెడ్డి (ఏడీఓ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్), డాక్టర్ సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి), కాటమరాజు (మెడికల్ ఆఫీసర్, తంగేడుపల్లి) తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది సేవలందించారు.

శిబిరంలో మొత్తం 205 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 65 మంది, ఆర్థోపెడిక్ సమస్యలకు 77 మంది, కంటి సంబంధిత సమస్యలకు 63 మంది చికిత్స పొందారు. అవసరమైన ఆరుగురిని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News