చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్
చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం 205 మందికి చికిత్స.. ఆరుగురికి భువనగిరి ఆస్పత్రికి రిఫర్
Editor Desk
చౌటుప్పల్,
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ గుడి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ముగుదాల పావని రమేష్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.
డిప్యూటీ డాక్టర్ యశోద మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, అవసరమైన వారికి భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని తెలిపారు.
ఈ శిబిరంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వినయ్, శ్రీనివాసరావు (ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్), మోహన్ రెడ్డి (ఏడీఓ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్), డాక్టర్ సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ డిఎంహెచ్వో భువనగిరి), కాటమరాజు (మెడికల్ ఆఫీసర్, తంగేడుపల్లి) తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది సేవలందించారు.
శిబిరంలో మొత్తం 205 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 65 మంది, ఆర్థోపెడిక్ సమస్యలకు 77 మంది, కంటి సంబంధిత సమస్యలకు 63 మంది చికిత్స పొందారు. అవసరమైన ఆరుగురిని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి