చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.
చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.
Editor Desk
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సర్పంచ్ బీసు ధనలక్ష్మి ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత వృత్తిలో ఎక్కువసేపు ఒకే భంగిమలో పనిచేయడం వల్ల కార్మికుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉన్నత స్థాయి చికిత్స కోసం రిఫరల్ సౌకర్యం కల్పించారు.
మొత్తం 192 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సేవలు పొందగా, అందులో 80 మంది పురుషులు, 112 మంది మహిళలు ఉన్నారు. సాధారణ వైద్యం, ఆర్థోపెడిక్, కంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఏడీఓ (హ్యాండ్లూమ్స్) సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి