Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే సమక్షంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 07:20 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.

 చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.
April 17, 2026 05:21 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సర్పంచ్ బీసు ధనలక్ష్మి ప్రారంభించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత వృత్తిలో ఎక్కువసేపు ఒకే భంగిమలో పనిచేయడం వల్ల కార్మికుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉన్నత స్థాయి చికిత్స కోసం రిఫరల్ సౌకర్యం కల్పించారు.

మొత్తం 192 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సేవలు పొందగా, అందులో 80 మంది పురుషులు, 112 మంది మహిళలు ఉన్నారు. సాధారణ వైద్యం, ఆర్థోపెడిక్, కంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఏడీఓ (హ్యాండ్లూమ్స్) సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News