చౌటుప్పల్లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం
చౌటుప్పల్లో ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యం
K.RAVI
హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నిగూఢంగా అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నల్గొండ జిల్లా ఆత్మకూరు (ఎస్) గ్రామం, మండలానికి చెందిన గుణగాటి మల్సూర్ (45, గౌడ్) ప్రస్తుతం చౌటుప్పల్లోని హనుమాన్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కూకట్పల్లిలోని ఎంఎస్ఎన్ (MSN) కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10:20 గంటల సమయంలో "హైదరాబాద్కు వెళ్తున్నాను" అని ఇంట్లో చెప్పి మల్సూర్ బయటకు వెళ్లారు. రాత్రి అయినా ఆయన తిరిగి ఇంటికి రాకపోవడం, సెల్ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. భర్త ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనతో ఆయన భార్య రాధిక ఆదివారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి