Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:09 AM

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం
March 14, 2026 05:38 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి V. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక్ అదాలత్ నిర్వహణపై కోర్టు పరిధిలోని మారుమూల గ్రామాల వరకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 28 వరకు ప్రతిరోజూ కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశముంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ , చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ , నారాయణపూర్ సీఐ రాములు , ఎక్సైజ్ సీఐ బాళోజి నాయక్ , ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News