Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:43 AM

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం
March 14, 2026 05:38 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి V. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక్ అదాలత్ నిర్వహణపై కోర్టు పరిధిలోని మారుమూల గ్రామాల వరకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 28 వరకు ప్రతిరోజూ కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశముంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ , చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ , నారాయణపూర్ సీఐ రాములు , ఎక్సైజ్ సీఐ బాళోజి నాయక్ , ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News