Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:10 AM

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం
14-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి V. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక్ అదాలత్ నిర్వహణపై కోర్టు పరిధిలోని మారుమూల గ్రామాల వరకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 28 వరకు ప్రతిరోజూ కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశముంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ , చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ , నారాయణపూర్ సీఐ రాములు , ఎక్సైజ్ సీఐ బాళోజి నాయక్ , ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Sthanikam

చౌటుప్పల్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన సమావేశం

Article Image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి A. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి V. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కరించేలా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక్ అదాలత్ నిర్వహణపై కోర్టు పరిధిలోని మారుమూల గ్రామాల వరకు సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 28 వరకు ప్రతిరోజూ కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవకాశముంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ , చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ , నారాయణపూర్ సీఐ రాములు , ఎక్సైజ్ సీఐ బాళోజి నాయక్ , ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News