Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

చౌటుప్పల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
06-03-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డులో బత్తుల నరసింహ, సుశీల దంపతుల కుమార్తె బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పేదలకు సొంత గృహం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్ గౌడ్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, ఆవుల యేసు, ఎండి ఎజాస్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డులో బత్తుల నరసింహ, సుశీల దంపతుల కుమార్తె బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పేదలకు సొంత గృహం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్ గౌడ్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, ఆవుల యేసు, ఎండి ఎజాస్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News