PRINT TIME: March 06, 2026 06:55 PM
చౌటుప్పల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అర్హులందరికీ ఇళ్లు అందజేస్తాం: చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
March 06, 2026 01:29 PM
140 Views
స్థానికం ప్రతినిధి :
CHOUTUPPAL MANDAL
K.RAVI
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డులో బత్తుల నరసింహ, సుశీల దంపతుల కుమార్తె బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పేదలకు సొంత గృహం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్ గౌడ్, షాదీఖానా చైర్మన్ ఎండి కరీం, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, ఆవుల యేసు, ఎండి ఎజాస్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి