చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
K.RAVI
అమరుల త్యాగాలను స్మరించుకున్న సీఐ మన్మధ కుమార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) మన్మధ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా సీఐ మన్మధ కుమార్ మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. "తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ యంత్రాంగం నిరంతరం అంకితభావంతో కృషి చేస్తుంది."ఈ వేడుకల్లో ఎస్ఐలు: కె. యాదగిరి, కృష్ణమాల్, నర్సిరెడ్డి, రవీందర్, రాంబాబు.చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది.స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి