Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!
18-04-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు తరలింపు పట్టించుకోని అధికార యంత్రాంగం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండానే నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఈ విషయమై స్థానిక సామాజిక కార్యకర్త బోయ లింగస్వామి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.​

విచ్చలవిడిగా తవ్వకాలు.

వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నల్లమట్టిని టిప్పర్ల ద్వారా చౌటుప్పల్ హైవే మీదుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తరలిస్తున్నారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నట్లు సమాచారం. అయితే, రాత్రి వేళల్లో తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.​నిమ్మకు నీరెత్తినట్లు అధికారులుఈ అక్రమ రవాణాపై స్థానిక రెవెన్యూ (ఎమ్మార్వో), పోలీస్ (సీఐ ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కళ్లముందే టిప్పర్లు తిరుగుతున్నా కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని, వారి పరోక్ష సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు.​చౌటుప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై స్పందించి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

చౌటుప్పల్ హైవేపై యథేచ్ఛగా మట్టి మాఫియా!

Article Image

అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు తరలింపు పట్టించుకోని అధికార యంత్రాంగం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండానే నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఈ విషయమై స్థానిక సామాజిక కార్యకర్త బోయ లింగస్వామి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.​

విచ్చలవిడిగా తవ్వకాలు.

వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు వ్యక్తులు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నల్లమట్టిని టిప్పర్ల ద్వారా చౌటుప్పల్ హైవే మీదుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తరలిస్తున్నారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నట్లు సమాచారం. అయితే, రాత్రి వేళల్లో తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.​నిమ్మకు నీరెత్తినట్లు అధికారులుఈ అక్రమ రవాణాపై స్థానిక రెవెన్యూ (ఎమ్మార్వో), పోలీస్ (సీఐ ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కళ్లముందే టిప్పర్లు తిరుగుతున్నా కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని, వారి పరోక్ష సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శించారు.​చౌటుప్పల్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై స్పందించి, అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News