Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 08, 2026 02:24 PM

చాట్రాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులకు ఘన సన్మానం

చాట్రాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులకు ఘన సన్మానం

చాట్రాయిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులకు ఘన సన్మానం
March 08, 2026 12:49 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యాశాఖ మరియు మాసగిరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలల మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సత్కరించారు. మండలంలో ఇంతవరకు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించకపోయినప్పటికీ ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాసగిరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు మండల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయినుల కోసం వివిధ రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చనుబండ పిఏసీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, హాజరై మహిళా ఔన్నత్యాన్ని చాటారు సందర్భంగా మాట్లాడుతూ మహిళ లేనిదే సృష్టి లేదని మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరారు. సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

ఎంఈఓ–2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి మాట్లాడుతూ మహిళలకు 50 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు లేకుంటే సమాజానికి మనుగడ లేదని తెలిపారు. బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయని, వరకట్న వేధింపులకు బలైన యువతి బాధను ప్రతిబింబించే గీతాన్ని స్వయంగా పాడి వినిపించారు. మహిళలకు సేవ చేయడంలో తల్లి స్ఫూర్తిగా ముందుంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, లక్ష్మీ, సౌభాగ్యం తదితరులు మరియు మండలంలోని మహిళా ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News